
తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ప్రాచీన హోదా పొందేందుకు తెలుగుకు అన్ని అర్హతలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. నిబంధనల ప్రకారమే ప్రాచీన హోదా కల్పించారని స్పష్టం చేసింది. తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా భాషలకు ప్రాచీన హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ 2009లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తెలుగుకు ప్రాచీన హోదాకు సంబంధించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాది రవీంద్రనాథ్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సంఘం సంచాలకుడు మామిడి హరికృష్ణ ధర్మాసనానికి వివరాలు సమర్పించారు. |